ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్రాక్షారామంలో పోటెత్తిన భక్తజనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:21 AM

స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు


  ద్రాక్షారామ,సూర్యప్రతినిధి: పంచా రామక్షేత్రాల్లో ప్రముఖమైనదిగా, త్రి లింగక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ భీమేశ్వరాలయం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్త జనంతో పోటెత్తింది. తెల్లవారు జామున 3గంటలకే ఆలయం తెరచి 4గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. భీమేశ్వరాలయం చెంత ఉన్న సప్తగోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే భీమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు జరిగాయి. దూర ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తుల రద్దీ ఉదయం నుంచి నిరంతరాయంగా కొనసాగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com