హీరో సాయి ధరమ్ తేజ్ బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘జవాన్’ చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలిసిఆయన ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు చిత్రబృందానికి తీర్థప్రసాదాలు అందజేశారు.
బీవీఎస్.రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈచిత్ర ట్రైలర్కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో ధరమ్కి జోడీగా మెహరీన్ నటించారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.