అనంతపురం: ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాసింగ్ వద్ద బైకుపై వస్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును ఢీకొట్టబోయాడు. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి స్టీరింగ్ ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. అయితే జనాలపైనుంచి దూసుకెళ్లిన బస్సు సరిగ్గా రోడ్డు పక్కన ఉన్న బావి అంచు వద్ద ఆగింది. బస్సును ఆపే ప్రయత్నంలో దాని ఎక్కువ భాగం బావిలోకి వంగింది. అయితే బస్సు డ్రైవర్ ఎంతో కష్టపడి సుమారు అరగంట పాటు కష్టపడి బస్సును బావి అంచున ఆపగలిగాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులుండటం గమనార్హం. సమాచారమందుకున్న పోలీసులు ప్రయాణికులను ఒక్కొక్క చొప్పున సురక్షితంగా కిందకు దింపారు. భయానక పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి 50 మంది ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు.