కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ-పిఠాపురం రైల్వేలైన్కు రైల్వేశాఖ మంగళం పాడింది. 2012లో దక్షిణమధ్య రైల్వే జీఎం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న రైల్వేబోర్డు ఈ లైన్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2012 నివేదిక కాకినాడ-పిఠాపురం రైల్వేలైన్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. రైల్వేలైన్ ఏర్పాటు తర్వాత తర్వాత ఆర్థిక ప్రగతి కూడా ఉండదని, ఇప్పటికే ఉన్న ఒకే లైన్ విస్తరణ వల్ల కనీస ఉపయోగం ఉందని పేర్కొంది. సరుకు రవాణాతో ఆదాయం మరో 50శాతం పెరిగే అవకాశం లేదని తెలిపింది.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకినాడ-పిఠాపురం రైల్వేలైన్ అభివృద్ధికి నిధులు కేటాయించింది. 2015-16, 2016-17 బడ్జెట్లలో ప్రభుత్వం నిధులు కేటాయించగా.. దీనికి విరుద్ధంగా ఈ రైల్వేలైన్ నిలిపివేస్తున్నట్లు బోర్డు ప్రకటించడం గమనార్హం. ఆ మార్గంలో ప్రస్తుతం చేపడుతున్న పనులన్నింటినీ నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది.