భీమిలి పీఎస్ వద్ద పోలయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అగ్రిగోల్డ్ బాధితుడైన పోలయ్య ఎన్రోల్మెంట్ కోసం పీఎస్ వద్ద క్యూలో నిలబడి ఉండగానే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడివారు పోలయ్యను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే పోలయ్య మృతి చెందాడు. మృతుడి స్వస్థలం భీమిలి మండలంలోని పాతపాడు గ్రామం.