చెన్నై: ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తప్పకుండా గెలుస్తానని అన్నాడీఎంకే పార్టీ నేత (శశికళ వర్గం) టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. తిరుప్పూర్లో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నికలో గెలిచి రెండాకుల గుర్తుకు పునర్వైభవం తీసుకొస్తామన్నారు. కాగా ఈసీ జారీ చేసిన రెండాకుల గుర్తును దినకరన్ వర్గం చాలెంజ్ చేయకుండా ఆదేశాలు జారీచేయాలని డిప్యూటీ సీఎం ఓ పన్నీర్సెల్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న అధికార అన్నాడీఎంకే పార్టీకి ఎన్నికల సంఘం రెండాకుల గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే.