ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 03:05 PM

గుజరాత్‌ రాష్ట్రం కేవలం పదిమంది పారిశ్రామిక వేత్తలది కాదని, రైతులు, మత్స్యకారుల రాష్ట్రమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఎన్‌ఆర్‌ఇజిఎకు 33 వేల కోట్ల రూపాయిలు మంజూరు చేసిందని, సరిగ్గా అంతే మొత్తాన్ని మోడీ టాటా నానోకు మంజూరు చేశారని రాహుల్‌ గాంధీ అన్నారు. బడా పారిశ్రామికవేత్త నిధులు అడిగితే ఒకరికే 33 వేల కోట్లు కేటాయించిన మోడీ, రైతులు లేదా మత్స్యకారులు అడిగితే 300 కోట్లు కూడా కేటాయించరని ఆయన అన్నారు. మోడీ రేడియో కార్యక్రమాన్ని గురించి ప్రస్తావిస్తూ తాము ప్రజల ‘మన్‌ కీ బాత్‌’ వినాలనుకుంటున్నామని రాహుల్‌ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com