న్యూఢిల్లి : ఎఐఎడిఎంకె చిహ్నం రెండు ఆకుల గుర్తు అంశంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె నేత పన్నీర్ సెల్వం సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు ఆకుల చిహ్నం తమకు కేటాయించాలంటూ టిటివి దినకరన్ కేసు దాఖలు చేసే అవకాశమున్నందున, తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయరాదని కోరుతూ పన్నీర్ సెల్వం కేవియెట్ పిటిషన్ దాఖలు చేశారు.