పాట్నా : పాట్నా- వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రి పియూష్ గోయెల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లోని మనిక్ పూర్ వద్ద పాట్నా వెళుతున్న పాట్నా వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ఈ తెల్లవారు జామున పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. 13 బోగీలు పట్టాలు తప్పిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై మంత్రి పియూష్ గోయెల్ విచారణకు ఆదేశించారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి లక్షరూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.