ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన మంత్రి గోయెల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 11:44 AM

పాట్నా :  పాట్నా- వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రి పియూష్ గోయెల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లోని మనిక్ పూర్ వద్ద పాట్నా వెళుతున్న పాట్నా వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ ఈ తెల్లవారు జామున పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. 13 బోగీలు పట్టాలు తప్పిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై మంత్రి పియూష్ గోయెల్ విచారణకు ఆదేశించారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి లక్షరూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com