ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 15వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు జరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాల కమిటీ బుధవారం సమావేశమై సంబంధిత తేదీల్లో పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు చర్చించి ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెల్లడించలేదు. అతి త్వరలోనే పార్లమెంట్ సమావేశాల తేదీలను అధికారికంగా వెల్లడించనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు.