అహ్మదాబాద్ :గుజరాత్లో దళితులు తయారు చేసిన ఒక పెద్ద జాతీయ పతాకాన్ని స్వీకరించడానికి ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విముఖత వ్యక్తం చేశారు. స్థలాభావం కారణంగా పతాకాన్ని స్వీకరించలేకపోతున్నామంటూ అధికారులు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ పతాకాన్ని స్వీకరించడానికి సుముఖత వ్యక్తం చేశారు. నేటినుంచి రెండు రోజులపాటు గుజరాత్లో పర్యటించనున్న రాహుల్ గాంధీ నేడు సనద్లోని దళిత్ శక్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. సమయంలో రాహుల్ గాంధీకి 125 అడుగల వెడల్పు, 83.5 అడుగుల ఎత్తు ఉన్న జాతీయ పతాకాన్ని దళితులు ప్రదానం చేయనున్నారని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ దోషీ చెప్పారు.