భీమండీ: మహారాష్ట్రంలోని భీమండీ పట్టణంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం కూలడంతో జరిగిన ప్రమాదంలో ఒరకు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోనని సిబ్బంది గాలిస్తున్నారు.