ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బందా వద్ద రైలు పట్టాలు తప్పింది. వాస్కోడిగామా పట్నా ఎక్స్ప్రెస్ రైలు 13 బోగీలు పట్టాలు పక్కకు ఒరిగాయి. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.