ప్రస్తుతం తాను ఇండిపెండెంట్ గానే ఉన్నానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. వీఐపీ బ్రేక్లో ఆమె తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం ముందు కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. తాను ఏ పార్టీ నుంచి పనిచేయటం లేదని, ఇండిపెండెంట్గానే ఉన్నానని కొత్తపల్లి గీత తెలిపారు.