విద్యార్థిని రాగమౌనిక మృతదేహం స్వగ్రామం చేరుకుంది. తన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాటమడుగు గ్రామానికి విద్యార్థిని రాగమౌనిక మృతదేహం చేరుకుంది. నిన్న చెన్నై సత్యభామ విశ్వవిద్యాలయంలో రాగమౌనిక ఆత్మహత్య చేసుకుంది. రాగమౌనిక సూసైడ్ తో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మౌనిక మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.