కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై రాష్ర్ట ప్రభుత్వం నుంచి కేంద్రం వివరాలు అడిగిందని మంత్రి సుజయకృష్ణ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖలో మరో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే సీఎం నిర్ణయం మేరకు విశాఖలో మరో ఉక్కు కర్మాగారం ఏర్పాటు ఉంటుందని వెల్లడించారు.