చెన్నై: ఎన్నికల సంఘం తమకు రెండాకుల గుర్తు కేటాయించడం సంతోషకరంగా ఉందని తమిళనాడు సీఎం పళనిస్వామి అన్నారు. రెండాకుల గుర్తు మాకు కేటాయించినట్లు అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. ఈ విషయంలో మెజార్టీ కార్యకర్తలు తమకు మద్దతుగా నిలిచారన్నారు. తమిళనాడు అధికార ఏఐఏడీఎంకే పార్టీకి ఎన్నికల సంఘం రెండాకుల గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే.