గుంటూరు: జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు చినకాకాని దగ్గర మూడున్నర ఎకరాల భూమిని ఓ రైతు దగ్గర లీజుకు తీసుకున్నారు. దీంతో ఇక త్వరలోనే పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఆపార్టీ అధినేత పవన్కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. కాగా... 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ అంతర్గత నిర్మాణాన్ని ఆయా జిల్లాల్లో పూర్తి చేశారు.