కాకినాడ: ఓఎన్జీసీ చైర్మన్ శశిశంకర్పై పార్లమెంట్ ప్రీవిలేజ్ కమిటీకి అమలాపురం పార్లమెంట్ సభ్యుడు పండుల రవీంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఎంపీలకు సమాచారమివ్వకుండా జిల్లాలో ఆయన పర్యటించడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపక్క ఎంపీలకు సమాచారమివ్వకపోవడమేగాక ఓఎన్జీసీ కార్యకలాపాలతో కోనసీమ వాసులు పడుతున్న కష్టాలను వివరించేందుకు వెళ్లినా శశిశంకర్ స్పందించడం లేదని ఆ ఫిర్యాదులో ఎంపీ రవీంద్రబాబు ఆరోపించారు.