చెన్నై: తమిళనాడు అధికార పార్టీ వర్గానికే ఏఐఏడీఎంకే రెండాకుల గుర్తు దక్కింది. ఏఐఏడీఎంకే బహిషృత నేత శశికళ వర్గానికి అదేవిధంగా రూలింగ్ పార్టీ వర్గాల మధ్య పార్టీ గుర్తు కేటాయింపు అంశంపై వివాదం ఎన్నికల కమిషన్ వద్దకు చేరిన విషయం తెలిసిందే. పలు విచారణల అనంతరం సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం ఆధ్వర్యంలోని అధికార పార్టీ వర్గానికే రెండాకుల గుర్తు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ స్టాంప్ అప్రూవల్ ఇచ్చినట్లుగా సమాచారం.