ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులతో ముచ్చటించిన మహేంద్ర సింగ్‌ ధోనీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2017, 12:57 PM

శ్రీనగర్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ విద్యార్థులతో సరదాగా గడిపాడు. సైన్యంలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ బుధవారం శ్రీనగర్‌లోని ఆర్మీ పబ్లిక్‌ పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చినార్‌ కార్ప్స్‌ తన ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ‘లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ విద్యార్థులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా చదువు-క్రీడల యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించాడు’ అని ట్వీట్‌లో పేర్కొంది. విద్యార్థులతో ముచ్చటించిన ధోనీ ఆ తర్వాత వారితో కలిసి ఫొటోలు దిగాడు. క్రికెట్‌ నుంచి కాస్త విరామం దొరకడంతో ధోనీ తన ఖాళీ సమయాన్ని ఇలా గడుపుతున్నాడు. త్వరలో భారత్‌-శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com