ఢిల్లీ: అవినీతి నిర్మూలనకు జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్లు ఉపయోగపడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లిdలో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్-2017 సదస్సులో మోడీ మాట్లాడుతూ… నరేంద్రమోడీ మొబైల్ యాప్ ద్వారా ప్రజల ఆలోచనలను నేరుగా పంచుకున్నానన్నారు. ప్రజల నుంచి నేరుగా సలహాలు, సూచనలు తీసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుందన్నారు. అత్యాధునిక సాంకేతికతతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.