న్యూఢిల్లి : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలయాల సందర్శనపై బిజెపి నేత జివిఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. అల్లావుద్దీన్ ఖిల్జి, ఔరంగజేబు అడుగుజాడల్లో రాహుల్ గాంధీ నడుస్తున్నారని ఆయన అన్నారు. ఖిల్జి, ఔరంజేబులు ముందుగా ఆలయాలను కూలగొట్టి, తరువాత వాటిని పునర్నిర్మిస్తామని వారు చెప్పేవారని, రాహుల్ తీరు కూడా సరిగ్గా అలాగే ఉందని జివిఎల్ అన్నారు.