న్యూఢిల్లీ: సైబర్స్పేస్ అంశంపై అయిదవ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ఇవాళ ఢిల్లీలో ప్రారంభించారు. సైబర్ఫర్ఆల్.. ఎ సెక్యూర్ అండ్ ఇన్క్లూజివ్ సైబర్స్పేస్ ఫర్ సస్టేయినబుల్ డెవలప్మెంట్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు సైబర్ స్పేస్ సదస్సు జరగనున్నది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా సేవలు సమర్థవంతంగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. చాలా సులువుగా ప్రజలకు సేవలు అందించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలకంగా మారిందన్నారు. ఈజ్ ఆఫ్ లీవింగ్ కోసం డిజిటల్ టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా తయారైందన్నారు. టెక్నాలజీ వల్ల సుపరిపాలన కూడా సాధ్యమైందన్నారు. టెక్నాలజీ అన్ని అవరోధాలను అధిగమించిందన్నారు. వసుదైక కుటుంబం అన్న భారతీయ సనాతన ధర్మాన్ని డిజిటల్ టెక్నాలజీ నిరూపిస్తున్నదన్నారు.