అమరావతి: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా ఆర్థికపరమైన నిర్ణయాలేవీ తీసుకోలేదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సభలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతోంది. సభలో ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ… అప్పటి యూపీఏ సర్కార్ చట్టంలో చేర్చి ఉంటే ఇబ్బందులుండేవి కాదన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ముంపు మండలాలను విలీనం చేయడంతో పోలవరం నిర్మాణానికి అడ్డంకులు తొలగాయన్నారు.