పుట్టపర్తి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. వెంగళమ్మ చెరువులో రూ.82 లక్షలతో నిర్మించిన రహదారులను వెంకయ్య ప్రారంభించారు. పుట్టపర్తి విమానాశ్రయం వద్దే వెంకయ్య నాయుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించి రహదారులను ప్రారంభించారు. స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా రూ.82 లక్షలతో ఈ రహదారుల నిర్మాణం చేపట్టారు.