ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ అగ్రనేతల హత్యకు ఉగ్రవాదుల కుట్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2017, 01:54 PM

బీజేపీ అగ్రనేతల హత్యకు ఉగ్రవాదుల కుట్ర


ప్రధాని మోదీతోపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని రెండు రోజుల కిందట ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఈ ఇద్దరినే కాకుండా బీజేపీకి చెందిన చాలా మందిని తీవ్రవాదులు హిట్‌లిస్ట్‌లో చేర్చినట్లు ఐబీ నివేదిక పేర్కొంది. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న జైషే మహ్మద్, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేశాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్‌లోని లేహ్ విమానాశ్రయాన్ని లష్కరే తొయిబా తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని, భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఐబీ తెలిపినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.


ఈ కుట్రలో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఉన్నాడని, ఆపరేషన్‌కు సంబంధించి ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారని ఐబీ వర్గాలు అప్రమత్తం చేశాయి. తొలుత బీజేపీకి చెందిన ఓ ముఖ్యమంత్రి హత్యకు వ్యూహం రచించినట్లు సమాచారం. ఈయన తక్కువ భద్రతతో తిరుగుతుంటారని తొలి లక్ష్యంగా ఆయనను ఎంపిచేసుకున్నారు. ఈ ఆపరేషన్‌‌ కోసం చేతులు కలిపిన లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు భారత భూభాగంలోకి చొరబడటానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ సమూహాన్ని సంప్రదించినట్లు ఐబీ తెలిపింది.


ఈ నేపథ్యంలో, బంగ్లా అధికారుల సహాయంతో ఢాకాలోని ఓ అనుమానిత ప్రదేశంపై ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేశారు. అయితే, అక్కడ ఎలాంటి సమాచారం లభించలేదని ఓ అధికారి తెలిపారు. గత నెలలో కశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంపై దాడిలో కీలక పాత్ర పోషించి మసూద్ అజార్ మేనల్లుడు తహ్లా రషీద్‌‌ను గతవారం పుల్వామాలో భద్రతా బలగాలు కాల్చి చంపాయి. రషీద్ హత్యకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు గత రెండు రోజుల్లోనే లష్క






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com