అమరావతి: వైకాపా నేత అంబటి రాంబాబుపై శాసనసభలో సభా ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. 168 నిబంధన కింద అంబటి రాంబాబుపై చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యాంగబద్ధమైన సభాపతి స్థానాన్ని కించపరిచేలా అంబటి వ్యాఖ్యలు చేశారని తీర్మానంలో పేర్కొన్నారు. సభాపతిని కించపరిస్తే సభను అవమానించినట్లే భావించి చర్యలు ఆయనపై తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. సభాపతి స్థానం తన జీవితంలో గొప్ప అదృష్టమన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధ కలిగించిందన్నారు. సభాపతి సభాపతి స్థానాన్ని విమర్శించడం సరికాదన్నారు.