విదేశాలకు వెళ్లేందుకు కార్తి చిదంబరానికి షరతులతో కూడిన అనుమతి సుప్రీం కోర్టు ఇచ్చింది. కాగా, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కార్తి చిదంబరం ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే, కుమార్తె విద్య కోసం యూకే వెళ్లాల్సి ఉందని, అందు కోసం డిసెంబర్ 1 నుంచి 10 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలని సుప్రీం కోర్టులో కార్తి చిదంబరం పిటిషన్ దాఖలు చేసిన విషయం విధితమే. ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీం కోర్టు కార్తి చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.