అమరావతి: నంది అవార్డులపై హైదరాబాద్లో ఉన్నవారు మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి లోకేష్ అన్నారు. ఇవాళ అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ నంది అవార్డులపై ఎన్ఆర్ఏలు మాట్లాడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇవ్వని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు కానీ ఇస్తున్న మాపై రాళ్లు విసురుతున్నారని తెలిపారు. ఏపీలో ఓటరు కార్డు, ఆధార్కార్డు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారని, కొన్ని మీడియా సంస్థలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.