రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో నూటికి నూరుశాతం సిమెంట్ రహదారులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఇవాళ శాసనసభలో ఉపాధి హామీ నిధుల వినియోగంపై చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం మాట్లాడుతూ ఉపాధి హామీ కింద రూ.16,572కోట్లు ఖర్చుపెట్టామన్నారు. ఉపాధి హామీ నిధులతో పలు నిర్మాణాలు చేపడుతున్నామని, ఇంకా 18వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు.