కర్నూలు:వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హుసేనాపురంలో జరిగిన వైసీపీ మహిళా సదస్సులో జగన్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఎంత అప్పు ఉంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తామన్నారు. సున్నా వడ్డీకే రుణాలను పునరుద్ధరిస్తామన్నామని, బ్యాంకులకు ప్రభుత్వం పడ్డ బకాయిని వెంటనే చెల్లిస్తామన్నారు. దశల వారీగా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామన్నారు.