చంద్రబాబు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం పోరాడే వారందరినీ అరెస్టు చేయడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యమా? నియంత పాలనా? అని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాలను అణచి వేయాలనుకోవడం దారుణమని, ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులు, బినామీలకు దారాదత్తం చేస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులను తెగనమ్మే అధికారం మీకెక్కడిది? అని చంద్రబాబును రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.