కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ ఇవాళ తుదిశ్వాస విడిచారు. 2008లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ప్రియరంజన్ దాస్ మున్సీ పక్షవాతానికి లోనయ్యారు. అప్పటినుంచి ఆయనకు నోటిమాట నిలిచిపోయింది. మెదడులో రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతో..శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో వైద్యులు ప్రియరంజన్కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా శ్వాసనందిస్తూ వస్తున్నారు. శ్వాసక్రియ, రక్తపోటు వంటివి నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రియరంజన్ దేహంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారని పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రియరంజన్దాస్ మున్షీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.