భారత అందాల సుందరి మానుషి చిల్లార్.. ‘మిస్ వరల్డ్ 2017’గా ఎంపికైన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల విరామం తరవాత ఓ భారత వనితకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. భారత్ తరఫున మిస్ వరల్డ్ టైటిల్కు ఎంపికైన ఆరో మహిళ మానుషి. 2000 సంవత్సరంలో టైటిల్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా తర్వాత ఇప్పుడు ప్రపంచ సుందరిగా ఎంపికైన భారతీయ వనిత మానుషియే కావడం విశేషం. 108 మందితో తీవ్రమైన పోటీ ఎదుర్కొన్న మానుషి.. నవంబర్ 18న చైనాలోని సన్యా నగరంలో జరిగిన తుది పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది.
మిస్ వరల్డ్గా నిలిచిన ఈ హర్యానా బ్యూటీకి దేశ నలుమూలల నుంచి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా చేరిపోయారు. ‘మానుషి.. భారత్ గర్వపడేలా చేశారు’ అని ప్రశంసిస్తూ పూరీ తీరంలో సైకత ప్రపంచ సుందరిని కొలువుదీర్చారు. మానుషి చిల్లార్ ప్రపంచ సుందరి కిరీటం ధరించిన సైకత శిల్పాన్ని పూరీ తీరంలో సుదర్శన్ నిర్మించారు. వెనుక మువ్వన్నెల జాతీయ జెండా, మానుషి చిల్లార్కు శుభాకాంక్షలు, మిస్ వరల్డ్ 2017 అని చెక్కిన సైకత శిల్పం అద్భుతంగా ఉంది.