ట్రెండింగ్
Epaper    English    தமிழ்

300 పరుగుల మైలురాయి దాటిన భారత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2017, 01:54 PM

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ ఐదో రోజు తన రెండో ఇన్నింగ్స్ లో భారత్ 300 పరుగుల మైలురాయిని దాటింది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక కంటే 122 పరుగులు వెనుకబడిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు రాణించడంతో ఐదో రోజు వేగంగా పరుగులు సాధించి 300 పరుగులు చేసి ఆధిక్యతను 180 పరుగులకు పెంచుకుంది. ప్రస్తుతం భారత్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 310 పరుగులు. ఇంకా చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్ట్ డ్రాగా ముగిసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కోహ్లీ 78 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com