కోల్కతా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ నిలకడగా ఆడుతోంది. ఐదో రోజు లంచ్ విరామానికి ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 251 పరుగులతో నిలిచింది. 129 పరుగుల ఆధిక్యంలో ఉంది. సారథి విరాట్ కోహ్లీ (41; 71 బంతుల్లో 4×4) అర్ధశతకానికి చేరువయ్యాడు. చక్కని బౌండరీలు బాదుతున్నాడు. కవర్డ్రైవ్లతో ఆకట్టుకుంటున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (0; 7 బంతుల్లో) క్రీజులోకి వచ్చాడు. మ్యాచ్ దాదాపు డ్రా దిశగా సాగుతోంది. లంక పేసర్ సురంగ లక్మల్.. రాహుల్, పుజారా, రహానెను పెవిలియన్ పంపించాడు.