అమరావతి: వెనుకబడిన వర్గాల్లో కులవృత్తుల కోసం నూతన ఆదరణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో తెలిపారు. లబ్ధిదారులకు ఉపకరణాలను అందించే విధంగా చర్యలు చేపడతామని ప్రశ్నోత్తరాల సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ఫెడరేషన్ల ద్వారా రూ.350కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. నూతన ఆదరణ పథకం కోసం మరో రూ.250కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన చేతివృత్తుల వారికి అధునాతన, మెరుగైన చేతి పనిముట్లు సమకూర్చడమే లక్ష్యంగా కొత్త ఆదరణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.