ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంట కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2017, 10:11 AM

రాజానగరం : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయరహదారిలోని కలవచర్ల కూడలిలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. దీంతో బస్సు అదుపుతప్పి సమీపంలోని పంట కాల్వలోకి దూసుకెళ్లింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రాజానగరం సీఐ కె.వరప్రసాద్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com