జమ్మూకశ్మీర్: అనంతనాగ్ జిల్లాకు చెందిన మజిద్ ఇర్షాద్ ఖాన్ అనే 20 ఏళ్ల ఫుట్బాల్ క్రీడాకారుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మజిద్ ఇర్షాద్ ఖాన్ ఇటీవలే ఉగ్రవాద సంస్థ లష్కరే యీ తోయిబాలో చేరాడు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్ ఎదుట లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. యవార్ నిస్సార్ (మజిద్ ఖాన్ స్నేహితుడు) అనే ఉగ్రవాది గత ఆగస్టులో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. యువార్ నిస్సార్ మృతి చెందిన తరువాత మజిద్ ఖాన్ లష్కరే సంస్థలో చేరాడు.