ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ వస్తోంది. స్పేస్ టెక్నాలజీకి చెందిన సెంటర్ ఫర్ ఎక్సలెన్సీని అనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కెనడాకు చెందిన ప్రభుత్వేతర సంస్థ కేనస్ ఇంటర్నేషనల్తో ఏపీ ప్రభుత్వం బెంగళూరులో ఒప్పందం చేసుకుంది. ఇదే సంస్థ నాగపూర్లో చిన్న శాటిలైట్ల తయారీని చేపడుతుంది. అనంతపురం జిల్లాలోని హిందూపురం దగ్గరలో ఉన్న టేకులేడు గ్రామంలో ఏర్పాటయ్యే సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలో అనేక పరిశోధనలకు ఆస్కారం ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ డాక్టర్ పీజీ దివాకర్ చెప్పారు.