పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం నాలుగు బస్సుల్లో అమరావతి నుంచి బయలుదేరారు. అసెంబ్లీ సమావేశాలకు నాలుగు రోజులు విరామం లభించింది. దీంతో గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ పోలవరం ప్రాజెక్టుకి ప్రభుత్వం తీసుకెళ్తోంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని వారు స్వయంగా చూడడం ద్వారా దాని విస్తృతి, కష్టం, ఇంజనీరింగ్ సామర్థ్యం తెలుస్తుంద ని భావిస్తోంది. జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా బయల్దేరారు.