తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న 59,679 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సర్వ దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతున్నది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉదయం 8 తర్వాత దర్శనానికి అనుమతిస్తారు.