న్యూఢిల్లీ: సరి-బేసి విధానంలో ఎటువంటి మినహాయింపూ లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. సరి-బేసి విధానంపై ఎన్జీటీ సూచనలను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. సరి-బేసి విధానం నుంచి ఎవరికైనా ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ప్రశ్నించింది. అలా ఇస్తే కాలుష్యం తగ్గుతుందా అని అడిగింది. మహిళలకు రవాణా పరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.