విశాఖపట్టణం : విశాఖ జిల్లాలోని గొల్లపేట గ్రామంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పది గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. బాధితులు బోరున విలపిస్తున్నారు.