గాంధీనగర్: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో మార్పులు అవసరమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఇవాళ ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు. 28 శాతం శ్లాబ్లో ఉన్న కొన్ని వస్తువులను 18 శాతం శ్లాబ్లోకి మార్చడం మంచి నిర్ణయమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ వత్తిడి వల్లే బీజేపీ దిగివచ్చిందన్నారు. అయినా ప్రస్తుత శ్లాబ్ విధానం పట్ల సంతోషంగా లేదని, అయిదు రకాల ట్యాక్స్లు వేయడం సరికాదు అని, అందుకే మార్పులు అవసరమని కాంగ్రెస్ నేత అన్నారు. ఒకవేళ తాము 2019లో అధికారంలోకి వస్తే, జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకురానున్నట్లు రాహుల్ తెలిపారు.