ట్రెండింగ్
Epaper    English    தமிழ்

61 శాతం పోలింగ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 02:06 AM

-ఉదయం నుండే ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు 


-12 జిల్లాల్లోని 53 నియోజకవర్గాలకు పోలింగ్‌  


-రాయిబరేలీ, అలహాబాద్‌ తదితర కీలక స్థానాల్లో ముగిసిన ఎన్నికలు  


-బీఎస్పీ నేత అరిదర్మాన్‌ సింగ్‌ కుమారుడు కాల్పులు జరిపినట్లు ఆరోపణ


-బీఎస్పీ, ఎస్పీ మద్దతుదారుల తన్నులాట  


-పలువురు కార్యకర్తలకు గాయాలు


-పోలింగ్‌ను బహిష్కరించిన ఖాగా గ్రామస్తులు  


-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంటూ ఆందోళన


లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నిలకు నాలుగో విడత పోలింగ్‌ ముగిసింది. 12 జిల్లా ల్లోని 53 నియోజకవర్గాలకు గురువారం పోలింగ్‌ జరుగగా, మొత్తం 680 మంది అభ్యర్థులు బరి లో దిగారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిం చారు. 60 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు అయి నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా మొత్తం 1.85 కోట్లు మంది తమ ఓటుహ క్కును వినియోగించుకున్నారు. రాయిబరేలీ,  అలహాబాద్‌ వంటి స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి హమీర్‌పూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఛీఫ్‌ కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అలహాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాయిబరేలీ కాంగ్రెస్‌ అభ్యర్థి సదర్‌ అదితి సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తర ƒప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ, సమాజ్‌వాది పార్టీ మద్దతు దారులు, కార్యకర్తలు తన్నుకున్నారు. ఎస్పీ నేత సిద్ధ గోపాల్‌ సాధు కుమారుడిపై బీఎస్పీ నేత అరిదర్మాన్‌ సింగ్‌ కుమారుడు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. కరల్రతో కొట్టుకుని రాళ్లను పరస్పరం రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాల నుంచి పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ముగ్గురు మాత్రం తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామం కాస్తంత కలవరానికి గురి చేసింది. ఫతేపూర్‌ జిల్లాలోని ఖాగా గ్రామస్తులు ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదంటూ ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన 105, 106 నెంబరు పోలింగ్‌ కేంద్రాల్లో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. మిగతా 107, 109 నెంబరు పోలింగ్‌ కేంద్రాల్లో 9, 8 ఓట్లు మాత్రమే „నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com