-ఐదు లక్షల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు
-సచివాలయంలో ప్రారంభించిన సీఎం, మంత్రి కామినేని
-రూ. 32 లక్షల వ్యయంతో ప్రారంభం
-అందుబాటులో 38 రకాల వైద్య పరికరాలు
అమరావతి నుంచి సూర్య ప్రతినిధి: దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునీక సాంకేతీక టెక్నాలజీ(ఏఎల్ఎస్)తో అంబులెన్సులను అమరా వతిలో ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చేతుల మీదగా 108 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించారు. 13 జిల్లాలకుగాను అత్యధునీక సాంకేతీక టెక్నాలజీతో 76 అంబులెన్సులు ఏర్పాటు చేశామన్న వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలియజేశారు.ఒక్కొక్క అడ్వాన్సడ్గ అంబులెన్సు 32 లక్షల వ్యయంతో, 38 రకాల వైద్య పరికారలు అందుబాటులో ఉంచినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. 5 లక్షల జనాభాకు ఒక అంబులెన్సు చొప్పున ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు. మన్న మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ అంబులెన్సులలో టెలిమెడిసిన్ డాక్టర్ ద్వారా రోగికి ప్రత్యేక వైద్య సహయం అందించే సదుపాయం ఏర్పాటు చేయా లని ముఖ్యమంత్రి సూచించినట్టు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. త్వరలో అంబులెన్సులో టెలిమెడిసిన్ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తా మన్న మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఏంపీ నిధుల నుండి మరో 13 ఏఎల్ఎస్ అంబులెన్సులు వస్తున్నట్లు మంత్రి కామి నేని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, వైద్య,ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండ య్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.