చెన్నై: తమిళనాడు కార్టూనిస్ట్ బాలాకు తిరునల్వేలి జిల్లా కోర్టు ఇవాళ బెయిల్ మంజూరీ చేసింది. తమిళనాడు సీఎం, పోలీస్ కమీషనర్పై వివాదాస్పద రీతిలో క్యారికేచర్ వేసిన కార్టూనిస్ట్ బాలాను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాను ఎటువంటి నేరం చేయలేదు అని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తన కార్టూన్లతో ఎత్తి చూపేందుకు వెనుకాడను అని బాలా అన్నారు. ప్రభుత్వ అసమర్థతపై కార్టూన్లు వేస్తూనే ఉంటానన్నారు.