తిరుమల : తిరుమల శ్రీవారిని సినీ నటుడు సందీప్ కిషన్ సోమవారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో టీటీడీ అధికారులు దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. నేను నటించిన కేరాఫ్ సూర్య చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు. తర్వాత మహేష్ బాబు చెల్లెల్లు మంజుల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్లు నటుడు సందీప్ కిషన్ తెలిపారు.